PM Modi Srisailam Visit: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయన వెంట ఉన్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![]() |
PM Modi Srisailam Visit |
మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవి పూజలు: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆరాధనలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృత రుద్రాభిషేకం, భ్రమరాంబ దేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ విధంగా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించిన ఐదవ ప్రధానిగా మోదీ నిలిచారు.
ఆలయ విశేషాలపై అవగాహన: పూజల అనంతరం ప్రధాని మోదీ ఆలయం అంతా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆలయ చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలను ప్రధానికి వివరించారు. ఈ ముగ్గురు నేతలు కలిసి ఆలయంలో పూజలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన: ఆలయ దర్శనం తర్వాత ప్రధాని మోదీ శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలాన్ని సందర్శించిన జ్ఞాపకార్థంగా నిర్మించిన ఈ స్మారక కాంప్లెక్స్లో ఆయన విగ్రహం, దర్బార్ హాల్, ధ్యాన మందిరాన్ని ప్రధాని పరిశీలించారు. శివాజీ ధ్యానముద్రలో ఉన్న విగ్రహానికి నమస్కరించి, ఆయన జీవిత చరిత్రను ప్రతిబింబించే శిల్పాలను ఆసక్తిగా వీక్షించారు. అలాగే ప్రతాప్గఢ్, రాజ్గఢ్, రాయ్గఢ్, శివనేరి వంటి ప్రముఖ కోటల నమూనాలను పరిశీలించారు.
శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన: ఆలయ దర్శనం తర్వాత ప్రధాని మోదీ శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలాన్ని సందర్శించిన జ్ఞాపకార్థంగా నిర్మించిన ఈ స్మారక కాంప్లెక్స్లో ఆయన విగ్రహం, దర్బార్ హాల్, ధ్యాన మందిరాన్ని ప్రధాని పరిశీలించారు. శివాజీ ధ్యానముద్రలో ఉన్న విగ్రహానికి నమస్కరించి, ఆయన జీవిత చరిత్రను ప్రతిబింబించే శిల్పాలను ఆసక్తిగా వీక్షించారు. అలాగే ప్రతాప్గఢ్, రాజ్గఢ్, రాయ్గఢ్, శివనేరి వంటి ప్రముఖ కోటల నమూనాలను పరిశీలించారు.
అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన: శ్రీశైలం పర్యటన అనంతరం ప్రధాని మోదీ కర్నూలుకు వెళ్లారు. అక్కడ రాష్ట్రంలోని వివిధ రంగాలకు సంబంధించిన రూ.13,430 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులలో పరిశ్రమలు, విద్యుత్ సరఫరా, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలు ఉన్నాయి.