TDP vs YSRCP Development Welfare: ఏపీలో అభివృద్ధి vs సంక్షేమం..చంద్రబాబు అమలు చేసినవేమిటి? జగన్ మిస్ అయినవేమిటి?

TDP vs YSRCP Development Welfare: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తిచేసుకుంది. గత సంవత్సరం జూన్ 12న అధికారం చేపట్టిన టిడిపి కూటమి, ప్రజలకు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాలు, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి ఎన్నో ఆశలతో ముందుకు సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్‌లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు అనుభవజ్ఞులైన నాయకులను కూడా చోటు కల్పిస్తూ సమతౌల్యాన్ని సాధించారు. తొలి మూడు నెలలలో పాలనాపరమైన మార్గదర్శకాలను అమలు చేయడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలపై కేంద్రీకరించారు. గుంతల రహదారులను పూడ్చడంతో పాటు పింఛన్ మొత్తాన్ని రూ.3,000 నుండి రూ.4,000కు పెంచి, మూడు నెలల బకాయిలతో అందజేశారు.

YSRCP - YS Jagan Mohan Reddy vs TDP - Chandra Babu's Development and Welfare

ఆ సమయంలోనే సీఎం సంతకం చేసిన తొలి ఫైల్ డీఎస్సీ నియామకాలదే. దాదాపు 16,400 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి, ఏడాది లోపే నియామక ప్రక్రియను పూర్తి చేశారు. ఇది వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనూ చేయలేకపోయిన పని. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించింది. ప్రస్తుతం దాదాపు 200 అన్న క్యాంటీన్లు మళ్లీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

పేద కుటుంబాల్లో విద్యార్థుల చదువుకోసం ఇచ్చే ఆర్థిక సాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం మరింత విస్తరించింది. ఇంట్లో ఒకరికి మాత్రమే 15,000 రూపాయలు అందించే వైసీపీ పథకాన్ని సవరించి, ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ వర్తించేలా చేసింది. గత ఏడాది దీపావళి నాడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తూ, ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేసింది.

YSRCP - YS Jagan Mohan Reddy Navarathnalu Welfare Schemes 


గ్రామాల అభివృద్ధికి “పల్లె పండుగ” పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేసి, దాదాపు రూ.4,000 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించింది. అంతేకాకుండా “అన్నదాత సుఖీభవ” పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20,000 సాయం అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం రైతులకు కేంద్రం అందించే రూ.2,000తో పాటు రాష్ట్రం నుండి రూ.12,000 వరకు అందేలా ఏర్పాట్లు చేసింది.

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంలో కూడా టిడిపి కూటమి ప్రభుత్వం ముందంజ వేసింది. గత ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోంది. సూపర్ సిక్స్ పథకాలలో కీలకమైనవాటి అమలుతో పాటు, మహిళలకు నెలకు రూ.1,500 సాయం పథకం మాత్రమే అమలు కావాల్సి ఉంది.

Chandrababu - Super Six Welfare Sechmes
TDP - Chandra Babu - Super Six Welfare Schemes 

అభివృద్ధి-సంక్షేమం మధ్య సమతౌల్యం సాధించడంలో టిడిపి కూటమి ప్రత్యేక శ్రద్ధ చూపింది. తొలి ఏడాది అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పాలనను గాడిలో పెట్టడం వంటి అంశాలపై దృష్టి సారించింది. అనంతరం సంక్షేమ పథకాలపైనా దృష్టి కేంద్రీకరించింది. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగించడం ద్వారా ప్రజల్లో సానుకూలతను సాధించగలిగింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టి, అభివృద్ధిని విస్మరించిందనే విమర్శలు ఎదుర్కొంది. ఆ లోటును గుర్తించిన చంద్రబాబు సర్కార్, రెండు అంశాలకూ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది.


మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post