AP NMMS Online Application 2025: కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అదే క్రమంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థులు స్కాలర్షిప్ పొందే అవకాశం కలుగుతుంది. 8వ తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయకుండా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రకటనను ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (AP Board of Secondary Education) విడుదల చేసింది.
![]() |
AP NMMS Online Application 2025 |
అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30, 2025 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. NMMS పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఉపకారవేతనం లభిస్తుంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 1 లక్ష మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. అందులో 4,087 స్కాలర్షిప్లు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు.
అర్హతలు:
- ప్రభుత్వ, మున్సిపల్, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ లేదా మోడల్ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్గా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
- 7వ తరగతిలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. (SC, ST విద్యార్థులకు రాయితీ వర్తిస్తుంది).
- తుది ఎంపిక సమయానికి 8వ తరగతిలో కూడా కనీసం 55% మార్కులు సాధించాలి.
- విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,50,000 మించకూడదు.
- ఎంపిక పరీక్షలో ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం విద్యార్థులను ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున ఉపకారవేతనం అందుతుంది.
దరఖాస్తు విధానం:
విద్యార్థుల దరఖాస్తులు ఆయా పాఠశాలల ద్వారా మాత్రమే AP Secondary Education Board వెబ్సైట్లో ఆన్లైన్గా సమర్పించాలి. తరువాత ప్రింటౌట్తో పాటు అవసరమైన ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయానికి అందజేయాలి.
- బీసీ, ఓసీ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.100/-
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.50/-
- ఆధార్ కార్డులో ఉన్న వివరాల ప్రకారమే దరఖాస్తులో నమోదు చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 4, 2025
- ఫీజు చెల్లింపు ప్రారంభం: సెప్టెంబర్ 10, 2025
- దరఖాస్తుల చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2025
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: అక్టోబర్ 10, 2025
- డీఈవోకు దరఖాస్తు పత్రాల సమర్పణ చివరి తేదీ: అక్టోబర్ 15, 2025
- డీఈవో లాగిన్లో దరఖాస్తు ఆమోదం చివరి తేదీ: అక్టోబర్ 20, 2025
- రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 7, 2025