Agrasen ki Baoli Mystery: అగ్రసేన్ కీ బావి అనేది ఢిల్లీలోని ఓ పురాతన బావి. ఇది ఢిల్లీ నగరంలోని కనాట్ ప్లేస్ సమీపంలో ఉంది. ఇప్పటికీ ఇది ప్రజలను ఆకర్షిస్తున్న ఒక ప్రత్యేకమైన చారిత్రక నిర్మాణం. బయట నుండి చూస్తే ఒక సాధారణ పాత బావిలా కనిపించినా, దీని లోపలికి దిగితే చీకటి, చరిత్ర, మిస్టరీ అన్నీ కలిసి ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి.
![]() |
Agrasen ki Baoli Mystery |
చరిత్ర: ఇది ఎప్పుడు, ఎవరు నిర్మించారన్న దానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే పౌరాణిక కథల ప్రకారం, ఈ బావిని అగ్రసేన్ మహారాజు అనే రాజు క్రీ.పూ. 3000–4000 మధ్య కాలంలో నిర్మించారంటారు. ఆయన హస్తినాపుర ప్రాంతాన్ని పాలించేవాడని చెబుతారు. అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించే ఆధారాలు లేవు. మరికొంతమంది చరిత్రకారులు మాత్రం ఇది 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల కాలంలో పునః నిర్మించబడిందని భావిస్తున్నారు. అందువల్ల ఈ బావి చరిత్రపై ఇప్పటికీ అనేక సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి.
నిర్మాణ శైలి: ఈ బావి నిర్మాణ శైలి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది పూర్తిగా రాళ్లతో నిర్మించబడిన స్టెప్వెల్, అంటే మెట్లు ఉన్న బావి. దీని లోతు సుమారుగా 60 మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 108 మెట్లు ఉన్నాయి. బావి మూడు అంతస్తులుగా ఉండి, ప్రతి దశలో మెల్లగా దిగుతూ వెళ్లేలా మెట్లు ఉంటాయి. దీని నిర్మాణ శైలిలో రాజస్థానీ మరియు మొఘల్ శిల్ప కళల మిశ్రమం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బావిలో దిగుతుంటే చీకటి పెరిగిన కొద్దీ మనసు కూడా ఏకాంతంగా మారిపోతుందనే అనుభూతి కలుగుతుంది.
ప్రజల అనుభవాలు: ఒకప్పుడు ఈ బావి బ్లాక్ వాటర్ గా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే, ఈ బావిలో ఉన్న నీరు నల్లగా ఉండేది. లోపలికి చూస్తే, భయానకమైన ముఖాల ప్రతిబింబాలు కనపడేవని అంటారు. “ఎవరో వెనక నుంచి పిలుస్తున్నట్టు వినిపించడంతో, టార్చ్ వెలిగించుకుని వెనక్కి తిరిగితే ఎవరు లేరు…” అని కొందరు పర్యాటకులు చెబుతారు.
పాతకాలంలో ఈ బావిని ప్రజలు వేసవిలో నీటి అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగించేవారు. అప్పట్లో నీరు పెద్ద సమస్యగా ఉండేది కాబట్టి, ప్రజలకు అవసరమైన నీటిని నిల్వ చేయటానికి ఇలాంటి స్టెప్వెల్స్ నిర్మించటం ఆనవాయితీగా ఉండేది. అంతేకాదు, వేసవిలో ఈ బావి లోపల చల్లదనంగా ఉండటం వల్ల ప్రజలు అక్కడ కొంతకాలం విశ్రాంతి కోసం కూడా సమయం గడిపే వారు.
Also Read: గండికోటలో దాగిన చరిత్ర గురించి మీకు తెలుసా.!
![]() |
Agrasen ki Baoli |
మిస్టరీలు: ఇప్పుడు వచ్చే అసలు ఆసక్తికరమైన భాగం ఏంటంటే, ఈ బావికి మిస్టరీలు ఎలా వచ్చాయి? పర్యాటకులు చెబుతున్న అనుభవాల ప్రకారం, బావిలో దిగుతూ ఉండగా ఏదో భయానకమైన శక్తి ఉన్నట్టుగా అనిపిస్తుందని వారు అంటున్నారు. కొంతమందికి విచిత్రమైన శబ్దాలు వినిపించాయంటారు. బావిలో నీటి ప్రతిబింబంలో కాళ్లు లేకుండా తిరుగుతున్న నీడలు కనిపించాయంటూ చెప్పినవారు కూడా ఉన్నారు. కొంతమంది బావిలో దిగినప్పుడు ఎవరో వెనక నుంచి పిలుస్తున్నట్టు అనిపించిందని చెప్పారు. ఇలా అనేక మానసిక అనుభూతుల వల్ల ఈ బావిని "హాన్టెడ్ ప్లేస్" అని పిలవడం మొదలైంది.
అంతేకాకుండా, గతంలో కొంతమంది ఈ బావిలో ఆత్మహత్యలు చేసుకున్నారని కొన్ని కథలు చెబుతున్నాయి. పురాతన కాలంలో బావిలో ఉన్న నీరు నల్లగా ఉండేదని, అందులో ఎవరో చూస్తున్నట్టుగా భయపడేలా ఉండేదని చెబుతారు. ఇదంతా విని చాలామందికి ఇది ఒక మాయా ప్రపంచంలా అనిపిస్తుంది. అయితే, ఈ కథలలో ఎంత వాస్తవం ఉంది?అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని ప్రశ్నగానే ఉంది.
ఇప్పటి పరిస్థితి: ప్రస్తుతం అగ్రసేన్ కీ బావి భారత పురావస్తు శాఖ (ASI) సంరక్షణలో ఉంది. రోజూ వందలాది మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వస్తుంటారు. ఫోటోలు తీసేందుకు, చరిత్ర గురించి తెలుసుకునేందుకు, లేదా ఈ మిస్టరీని స్వయంగా చూసేందుకు ప్రజలు ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ ఉచితం, అలాగే బాగా సురక్షితంగా నిర్వహిస్తున్నారు.
అగ్రసేన్ కీ బావి ఒక చారిత్రక నిర్మాణమే కాకుండా, రహస్యాలను తనలో దాచుకున్న ఓ నిశ్శబ్ద ఘట్టం. ఇది చూసినవారికి చరిత్రను మాత్రమే కాదు, భయాలు ఎలా రూపాన్ని దాల్చుతాయో కూడా చెప్పేలా ఉంటుంది. అందుకే ఇది ఒకసారి తప్పకుండా చూడదగిన ప్రదేశం.
Also Read: దలైలామా జీవితం వింటే... కన్నీళ్లు ఆగవు!
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS