Brihadeeswara Temple: బృహదీశ్వర ఆలయం రహస్యం

Brihadeeswara Temple: తమిళనాడులోని తంజావూర్లో ఉన్న బృహదీశ్వర ఆలయం, 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడి కాలంలో నిర్మించబడింది. ఇది పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించబడింది. కానీ దాని దగ్గర 100 కిలోమీటర్ల వరకు కూడా గ్రానైట్ దొరకదు. దీన్ని ఎక్కడ్నుంచి తెచ్చారో? దీన్ని ఎలా తెచ్చారో? ఎలా కోశారో? ఇప్పటికీ స్పష్టతలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ శిఖరంపై ఉన్న 80 టన్నుల కేప్‌స్టోన్ (శిఖర రాయి)ను పైకి ఎలా ఎక్కించారన్నది పరిష్కారమవ్వని రహస్యం.



కొంతమంది చరిత్రకారులు చెబుతున్నది ఏంటంటే.. 6 కి.మీ పొడవైన మట్టితో చేసిన వంతెనల ద్వారా రాయిని పైకి లాగారట. అంతేకాక ఆలయాన్ని నిర్మించిన శిల్పకళాకారులకు సంబంధించిన పేర్లను గోడలపై చెక్కారట. ఈ ఆలయం యునెస్కో వారసత్వ సంపదగా కూడా గుర్తించబడింది. ఇంత శాస్త్రీయ నిర్మాణ నైపుణ్యం అప్పటిలో ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ప్రపంచం ఆశ్చర్యపడుతుంది. Also Read: బద్రీనాథ్ టెంపుల్ సీక్రెట్ డోర్

మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post